ఈ సమయంలో గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌

కరోనా ప్రాధమిక స్థాయిలో ఉన్న సమయంలోనే దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించినా కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.

కేసుల సంఖ్య వందల్లో పెరుగుతూ ఉంటే రికవరీ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

తెలంగాణలో మొదటి కరోనా కేసు రికవరీ అవ్వగా ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కరు కూడా రికవరీ అవ్వలేదు.ఈ విషయం కాస్త ఆందోళన కలిగించే విషయంగా అందరు భావిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ గుడ్‌ న్యూస్‌ ను షేర్‌ చేశారు.

ప్రస్తుతం గాంధీ హాస్పిటల్‌లో కరోనా పాజిటివ్‌ కేసులుగా జాయిన్‌ అయిన వారిలో 11 మందికి కరోనా నెగటివ్‌ గా నిర్థారణ అయ్యింది.వారిని ఒకటి రెండు రోజుల్లోనే డిశ్చార్జ్‌ చేయబోతున్నట్లుగా మంత్రి ప్రకటించారు.

కరోనాకు తెలంగాణ ప్రభుత్వం మంచి చికిత్స అంద జేస్తుంది అనేందుకు ఇది నిదర్శణంగా కేటీఆర్‌ పేర్కొన్నారు.ఈ విషయాన్ని రేపు లేదా ఎల్లుండి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

తాజా వార్తలు