చిరంజీవి బహుమతి వల్లే బ్రతికి ఉన్నా.. కృష్ణవంశీ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణవంశీ ముక్కుసూటిగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే.కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

అయితే ఈ మధ్య కాలంలో కృష్ణవంశీకి వరుస షాకులు తగులుతున్నాయి.కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోవడం లేదనే సంగతి తెలిసిందే.

అయితే కృష్ణవంశీ తాజాగా చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ వల్లే తాను ప్రాణాలతో బ్రతికి ఉన్నానని తెలిపారు.నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని చిరంజీవి గారు ఎంతో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నారని కృష్ణవంశీ తెలిపారు.

తోటి నటీ నటులు, ఇతర చిత్ర బృందాన్ని చిరంజీవి ఎప్పుడూ గౌరవిస్తారని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.ఈ విషయంలో కెరీర్ తొలినాళ్లలో ఎలా ఉన్నారో ఇప్పటికీ చిరంజీవి అలానే ఉన్నారని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

Advertisement

ఈ కారణం వల్లే చిరంజీవి అంటే నాకు ఎంతో గౌరవం అని ఆయన తెలిపారు.నేను ఇబ్బందులలో ఉన్న సమయంలో చిరంజీవి గోవిందుడు అందరివాడేలే సినిమాకు పని చేసే ఛాన్స్ ఇచ్చాడని కృష్ణవంశీ తెలిపారు.

గతంలో చిరంజీవితో కలిసి ఒక యాడ్ చేశానని ఆ సమయంలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఈ కారును బహుమతిగా అడిగితే ఇచ్చేస్తారా అని అడిగానని కృష్ణవంశీ తెలిపారు.

ఆ సమయంలో చిరంజీవి కారు కావాలా అని అడిగారని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.చిరంజీవి నాతో ఈ కారును నీకే బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పి ఇచ్చారని కృష్ణవంశీ అన్నారు.ఒకసారి కారులో ప్రయాణిస్తున్న సమయంలో పెద్ద యాక్సిడెంట్ జరిగినా నాకు, డ్రైవర్ కు చిన్న గాయాలయ్యాయని చిరంజీవి బహుమతి నా ప్రాణాలను కాపాడిందని ఆయన చెప్పుకొచ్చారు.

కృష్ణవంశీ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు