పారితోషికం పెంచేసిన కొరటాల శివ

ఇంతింతై,వటుడింతై అన్నట్టు ఎదుగుతున్నారు దర్శకుడు కొరటాల శివ.రచయితగా కెరీర్ ను ప్రారంభించి, కేవలం రెండు సినిమాలతోనే అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఆయన.

తోలి సినిమా మిర్చికి ఎంత తీసుకున్నారో తెలియదు కాని భారి లాభాలు తెచ్చిపెట్టిన శ్రీమంతుడు కి ఆయన తీసుకున్న పారితోషికం తక్కువే అని చెప్పాలి.3.5 కోట్లకు ఒప్పందం జరిగితే, లాభాల్లో వాటాగా మరో కోటిన్నర అందుకున్నారు.మహేష్ బాబు 50 లక్షలు పెట్టి కొనిచ్చిన కారు అదనం.

మొన్నే ఎన్టీఆర్ తో "జనతా గ్యారేజ్" అనే సరికొత్త సినిమా మొదలుపెట్టారు కొరటాల.శ్రీమంతుడు భారి హిట్ అవడంతో ఆయన డిమాండ్ తో పాటు రేట్ కుడా పెరిగింది.

ఎన్టీఆర్ సినిమాకు ఆయనకు అందబోతున్న మొత్తం 10 కోట్లకు పైగానే అంటున్నారు.రాజమౌళి,త్రివిక్రమ్,శ్రీనువైట్ల,పురిజగన్నాథ్, వి వి వినాయక్ తరువాత 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్న ఆరోవ తెలుగు దర్శకుడు కొరటాల శివ.జనతా గ్యారేజ్ కుడా శ్రీమంతుడు తరహాలో రికార్డులు తిరగరాస్తే ఆయన పారితోషికం చుక్కల్ని తాకడం ఖాయం.సినిమాలు ఆడినంత కాలం పారితోషికం పెంచుకుంటూ పోయినా తప్పేమీ లేదు.

ఈ సూపర్ హిట్ సినిమాల్లో మొదట అనుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు