తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మంచి జోరు మీద ఉంది.వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కు అందుకున్న టాలీవుడ్ లాభాల బాటలో నడుస్తోంది.
కాగా తెలుగులో ఉన్న స్టార్ హీరోలు మరియు డైరెక్టర్ కు కలిసి కుమ్మక్కు అయిపోతున్నారు.వీళ్ళు కలిసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు.
పరిస్థితి బట్టి స్టార్ హీరోల కోసం డైరెక్టర్ లు మరియు డైరెక్టర్ ల కోసం స్టార్ హీరోలు సపోర్ట్ గా నిలబడుతూ వెయిట్ చేస్తున్నారు.ఇలా జరుగుతూ ఉండడంతో టాప్ డైరెక్టర్ లు అంతా కూడా స్టార్ హీరోల సినిమాలపైనే మొగ్గు చూపుతున్నారు.
ఇక యంగ్ హీరోలకు అయితే డైరెక్టర్ ల కొరత ఏర్పడింది.అందుకే వీరు పక్కన రాష్ట్రాల నుండి డైరెక్టర్ లను వెతుక్కునే పనిలో పడ్డారు.
ఇక లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సక్సెస్ కొట్టాడు.కానీ కథ కథనం సరిగా లేకపోవడంతో నెక్స్ట్ వచ్చిన ఆచార్య మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలి పోయింది.
దీనితో ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా నిరాశ పడ్డారు.ఆ తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో తన 15 వ సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమాపై అటు శంకర్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు.కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ తో హీరోయిన్ గా కియారా అద్వానీ చేస్తోంది.
ఇక యంగ్ హీరోలలో రామ్ ది సెపరేట్ రూట్ అని చెప్పాలి.ఇతను రెడ్ ప్లాప్ తర్వాత డైరెక్టర్ ను మార్చేశాడు.ఏకంగా కోలీవుడ్ లో ఉన్న డైరెక్టర్ ను పట్టుకున్నాడు.
డైరెక్టర్ లింగుస్వామి తో ది వారియర్ సినిమాను చేస్తున్నాడు.ఇది రెండు భాషల్లోనూ ఏకకాలంలో విడుదల కానుంది.
ఇందులో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది.ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రెయిలర్ మరియు పాటలకు మంచి స్పందన వచ్చింది.
అక్కినేని ఫామిలీ నుండి వచ్చిన నాగచైతన్య వరుస హిట్ లను అందుకుంటూ వెళుతున్నాడు.లేటెస్ట్ గా థాంక్యూ మూవీతో మరోకొత్త స్టోరీని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు.ఈ సినిమాను మనం లాంటి అద్బుతమయిన మూవీ ని టాలీవుడ్ కు అందించిన విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ మధ్యనే రిలీజ్ ఐయాం థాంక్యూ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుని రిలీజ్ కోసం వెయిట్ చేసేలా చేస్తోంది.ఇక ఈ సినిమా రిలీజ్ కాకుండానే మళ్ళీ ఒక వెబ్ సిరీస్ తో రానున్నాడు చై.దేనికి దూత అనే టైటిల్ ను ఖరారు చేశారు.దీని తరువాత తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు.
ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.ఈ ప్రాజెక్ట్ కు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ సినిమాలోనూ కృతిశెట్టి హీరోయిన్ కావడం విశేషం.
ఒక నటుడిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్న అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.తాను కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటుడు అయినప్పటికీ అన్ని భాషలలోనూ సినిమాలు చేసి ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్నాడు.ఇతను కేవలం నటుడిగానే కాకుండా నిర్మాత మరియు దర్శకుడిగా కూడా ట్రై చేశాడు.
తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం విశ్వక్ సేన్ హీరోగా మరియు అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాకు దర్శకుడిగా అర్జున్ వ్యవహరించబోతున్నారు.
ఇటీవలే ఈ సినిమా హైద్రాబాద్ లో స్టార్ట్ అయింది.ఇందుకు ముఖ్యఅతిథులుగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మరియు రాఘవేంద్రరావు లు అటెండ్ అయ్యారు.
ఈ మధ్యనే తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుస హిట్ లను సాధిస్తూ అందరి దృష్టిలో పెట్టాడు.ముఖ్యంగా కమలహాసన్ హీరోగా చేసిన విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇప్పుడు ఇతనితో సినిమాలు చేయడానికి అందరూ క్యూలు కడుతున్నారు.
కాగా తాజాగా రామ్ చరణ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయట.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
లోకేష్ కు దీనికి గాను అడ్వాన్స్ కూడా ఇచ్చారట.మరియు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అట్లీ ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాడు.
ఆ విధంగా తమిళ్ డైరెక్టర్స్ అంతా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy