రాధా ఇంటికి నాని...? మొదలైన బుజ్జగింపులు !

ప్రస్తుతం రాజకీయంగా ఎంతో కీలకం అయిన కాపు సామజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో రాధా కు వైసీపీ కి మధ్య వ్యవహారం చెడడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడం.కాపు రిజర్వేషన్స్ అంశంపై ఆ సామాజికవర్గం వారు అలక చెందడం ఈ కారణాలతో ఇప్పటికే వైసీపీ అప్రతిష్ట మూటగట్టుకుంది.

అందుకే ఇటువంటి సమయంలో రాధ రాజీనామా చేయడం పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అనే ఆలోచనతో వైసీపీ అధిష్టానం నష్టనివారణ చర్యలకు దిగింది.

దీనిలో భాగంగానే.రాధా ఆప్తమిత్రుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ద్వారా హై కమాండ్ చివరి ప్రయత్నం చేయిస్తోంది.! కాసేపట్లో కొడాలి.

Advertisement

రాధా ఇంటికి వెళ్లనున్నారు.రాధాకృష్ణకు టీడీపీ ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేసిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మార్చిలో ఖాళీ అవుతున్న వాటిలో ఒకటి ఎమ్మెల్సీ రాధాకు ఇవ్వాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.అయితే ఇప్పటికే వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంతనాలు జరిపిన పదినిమిషాలకే రాధా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రాధా మిత్రుడు, ఎమ్మెల్యే గుడివాడ నాని రాయబారం నడుపుతున్నారు.ఈ బుజ్జగింపులు ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు