బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు

బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తెలంగాణలో సింరగేణి సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు.

 Kishan Reddy's Criticism Of The Brs Government-TeluguStop.com

ఎన్నికల సమయంలోనే సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుర్తొస్తారని కిషన్ రెడ్డి విమర్శించారు.సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కట్టి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందని తెలిపారు.20 వేల పర్మినెంట్ ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కోత పెట్టిందన్నారు.సింగరేణి బకాయిలు కూడా రూ.10 వేల కోట్లు దాటాయని పేర్కొన్నారు.అప్పులు చేస్తే కానీ సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.సింగరేణి పరిస్థితి ఇలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube