మన్మధుడు 2 ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్

కింగ్ నాగార్జున కెరియర్ లో మన్మధుడు సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఈ సినిమాకి త్రివిక్రమ్ అందించిన మాటలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాయి.

సినిమాలో కామెడీ టైమింగ్ అడుగడుగునా ప్రేక్షకులని నవ్విస్తుంది.ఈ సూపర్ హిట్ సినిమాకి ఇప్పుడు మళ్ళీ నాగ్ సీక్వెల్ ని ప్లాన్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు.

చిలాసౌ సినిమాతో దర్శకుడుగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ మన్మధుడు 2 సినిమాని తెరపైకి ఎక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా స్టొరీ ఫైనల్ చేసిన నాగ్ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టించేసాడు.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్ పుత్ ని ఫైనల్ చేసారు.ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ నెల 25 సినిమాని అధికారికంగా లాంచ్ చేసి ఏప్రిల్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టాలని నాగ్ ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ యూరప్ లో జరుగుతుంది అని తెలుస్తుంది.

మరి మన్మధుడు లాంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా వస్తున్నా ఇది ఆ ఫీట్ ని అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు