వందకు పైగా హత్యలు చేసిన కిల్లర్ డాక్టర్..!

డాక్టర్ ని దేవుడి తర్వాత దేవుడిగా కొలుస్తారు.ప్రాణాలను కాపాడాల్సిన వైద్యుడే వంద మందికి పైగా ప్రాణాలను తీశాడు.

ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాలలో కలిపి వంద మందికి పైగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.అయితే కిల్లర్ డాక్టర్ దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన నార్కోటిక్స్ సెల్ ఢిల్లీలోని బాప్‌రైలాలో అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కిల్లర్ డాక్టర్ దేవేంద్ర శర్మ చదివింది బీఏఎంఎస్ మాత్రమే కానీ అతను కిడ్నీలు తొలగించడంలో మహాదిట్ట.

దేవేంద్ర శర్మ ట్రక్ డ్రైవర్లను చంపి వారి కిడ్నీలను అమ్ముతూ ఉండేవాడు.ట్రక్ డ్రైవర్ల మృతదేహాలను కాస్గంజ్ సమీపంలోని హజా కాలువలో మొసళ్లకు ఆహారంగా వేసి ఆధారాలు మాయం చేసేవాడు.

Advertisement

అనంతరం వాహనాలను కాస్గంజ్‌లో అమ్మేసి సొమ్ము చేసుకునేవాడు.అయితే దేవేంద్ర శర్మ హత్యల సంఖ్య సెంచరీ చేరుకోవడంతో హత్యలు చేయడం ఆపేశాడు.

అంతేకాదు, అతడో కిడ్నీరాకెట్ సూత్రధారి కూడా.దేశంలోని పలు రాష్ట్రాల్లోని కిడ్నీ రాకెట్‌తో సంబంధాలు కూడా ఉన్నాయి.

అతని దగ్గరికి వైద్యం కోసం వచ్చిన వారి నుంచి వారికి తెలియకుండా కిడ్నీలు తొలగించి అమ్మేవాడు.ఇలా దాదాపు 125 మందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశాడని తెలిపారు.ఒక్కో కేసులో రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేసేవాడని పోలీసులు తెలిపారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు