ఐటీ అధికారుల పేరుతో వ్యక్తి కిడ్నాప్ కలకలం.. హైదరాబాద్ లో ఘటన

హైదరాబాద్ లో వ్యక్తి కిడ్నాపైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఐటీ అధికారుల పేరుతో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గత నెల 27న మురళీకృష్ణ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.బాధిత కుటుంబం నుంచి నగదును తీసుకున్న కిడ్నాపర్లు మురళీకృష్ణను విడిచిపెట్టారు.

అనంతరం బాధితుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు.బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు