నిజామాబాద్ జిల్లా బీజేపీ రైతు ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం టీఆర్ఎస్ అని విమర్శించారు.
రైతు ధర్నాకు రాకుండా తనను అడ్డుకున్నారన్న ఆయన.కేసీఆర్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయన్నారు.
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రజల్ని మోసం చేశారని ఎద్దేవా చేశారు.ప్రతిపక్ష పార్టీల నేతల్ని, అభివృద్ధి కోసం నిలదీసే వారిని నిలువరించేందుకు చట్టాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.
స్పైస్ బోర్డు, పసుపు బోర్డుకు తేడా ఎంటో తెలియని వ్యక్తి మంత్రి వేముల ప్రశాంత్ అని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.