ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టడమే పాపమా...ప్రియాంక హత్యపై అనుష్క ఆవేదన!

ప్రియాంక అత్యాచారం, హత్య ఘటనని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా ఖండించారు.

మరో వైపు రాజకీయ పార్టీలు, సామాజిక సేవా సంస్థలు, మహిళా కమిషన్ కూడా స్పందించింది.

ఆమెని హత్య చేసిన వారిని నడిరోడ్డు మీద ఉరితీయాలని అందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు.ఇదిలా ఉంటే ఆమె హత్యపై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు.

మహిళలని గౌరవించాలనే మాట రాసుకోవడానికి, చెప్పుకోవడానికి తప్ప ఇలాంటి ఘటనలు చూస్తున్నప్పుడు నిజంగా జరుగుతున్నాయా అనిపిస్తుంది.నిందితులని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అని ట్వీట్ చేశారు.

ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఆమె హత్యపై కామెంట్స్ చేశారు.ఇదిలా ఉంటే ఆమె హత్యపై కీర్తి సురేష్ ఎమోషనల్ గా ట్వీట్ చేసింది.

Advertisement

ఎటు పోతుంది సమాజం.ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే ఆడపిల్ల బయటకి వెళ్లాలంటేనే భయపడిపోతుంది.

ఈ ఘటనపై పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అని పోస్ట్ పెట్టింది.ఇక స్వీటీ శెట్టి అనుష్క కూడా ఆవేదనగా పోస్ట్ పెట్టింది.

ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టడమే పాపమా? ఇలాంటి వారిని జంతువులతో పోల్చినా అవి కూడా సిగ్గుగా ఫీలవుతాయి.ఈ నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేవరకు పోరాడదాం.

ప్రియాంకకు నా నివాళి అని ఆవేదన వ్యక్తంచేశారు.మరి వారిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులకి ఎలాంటి శిక్ష వేస్తారు అనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు