బ్రాండ్ కేసీఆర్ ! ఓహో ఈ స్టైల్ లో ప్రచారం మొదలెట్టారా ..?

సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ రాసి ప్రజలను తమ వైపు ఎలా తిప్పుకోవాలో టీఆర్ఎస్ అగ్ర నాయకులకు బాగా తెలుసు.

ఒకప్పుడు పాతాళంలో ఉన్న పార్టీని సెంటిమెంట్ అనే బ్రహ్మాస్త్రం ద్వారా పైకి తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి దక్కుతుంది.

అసలు అదంతా ఎందుకు తెలంగాణ ఏర్పడిందే సెంటిమెంట్ మీద.తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం లోకి వచ్చింది సెంటిమెంట్ మీదే.ఇప్పుడు ఆ సెంటిమెంట్ కాస్త తగ్గింది.

టీఆర్ఎస్ ప్రత్యర్థులంతా ఒక్కటవుతున్నారు.దీనికి తోడు ప్రజావ్యతిరేకత, అసంతృప్తులు, అలకలు ఇలా సవాలక్ష ఇబ్బందుల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతోంది.

పరిస్థితి అదుపు తప్పేలా కనిపిస్తుండడంతో రంగంలోకి దిగిన కేటీఆర్, కవిత సెంటిమెంట్ బాగా పండించే పనిలో బిజీ బిజీ అయిపోయారు.ప్రతి సభలోను వారిద్దరూ యువత ఓట్లను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో లోపాలను గట్టిగా ఎత్తిచూపుతున్నారు.ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్ సీఎం కావాలా ? లేక గల్లీలో అందుబాటులో వుండే సింహం లాంటి కెసిఆర్ సీఎం కావాలో తేల్చుకోవాలనే నినాదంతో టీఆర్ఎస్ బాగా ప్రచారం మొదలు పెట్టేసింది.

Advertisement

అమరావతికి దాసుడు కావాలా ? ఢిల్లీ కి గులాం అయ్యేవారు కావాలా అంటూ కెటిఆర్, కవిత సెంటిమెంట్ రాజేశారు.బ్రాండ్ కేసీఆర్ అనే నినాదం తో టీఆర్ఎస్ చేపట్టిన ఈ ప్రచారం ఆ పార్టీలో జోష్ నింపుతోంది.తెలంగాణ సాధించింది ఆత్మగౌరవం కోసం తప్ప అధికారం కోసం కాదంటూ వారిద్దరూ దూసుకుపోతున్నారు.

తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ అనైతిక పొత్తు పెట్టుకుంటుందన్నారు.తెలంగాణలో అమరులైన వారు చెప్పారనా? కోదండరామ్ ఆ పార్టీలతో కలసి వెళుతున్నారని ప్రశ్నిస్తున్నారు.ఆంధ్రా పెత్తనం తెలంగాణపై రుద్దేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలయ్యాయని అంటూ కూటమిలోని పార్టీల తీరుపై వారు విరుచుకుపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు