టాలీవుడ్లో ఓ సినిమా సూపర్ హిట్గా నిలిస్తే, వెంటనే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో వినిపిస్తుంది.దీంతో పలు సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్ చిత్రాలను రెడీ చేసి వాటితో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
ఈ క్రమంలో టాలీవుడ్లో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ‘కార్తికేయ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో బెస్ట్ మూవీగా ఈ సినిమా అతడికి టర్నింగ్ పాయింట్ను అందించింది.
ఇక ఈ సినిమాను దర్శకుడు చందు ముండేటి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చిన దర్శకనిర్మాతలు, ఈ సీక్వెల్ను ఎట్టకేలకు ప్రారంభించారు.
కానీ కరోనా కారణంగా ఈ సీక్వెల్ చిత్రం అనుకున్న దానికంటే మరింత ఆలస్యం అవుతోంది.ఇక ఈ సినిమాలో మరోసారి నిఖిల్ తనదైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోండగా, ఈ సినిమాలో హీరోయిన్గా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ను ఎంపిక చేశారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ను అందాలకు కేరాఫ్గా నిలిచే గ్రీస్ దేశంలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ మేరకు వారు లొకేషన్స్ను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
కార్తికేయ 2 చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను సెప్టెంబర్ చివరి నాటికి ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దీంతో కార్తికేయ 2 చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.