కర్నూలులో నవవధువు ఆత్మహత్య..!

పెళ్లై నెల రోజులు కూడా కాలేదు.కాళ్లకు ఉన్న పారాణీ కూడా ఆరిలేదు.

నవ వధువు అఘాయిత్యానికి పాల్పడింది.చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

పెళ్లితో కొత్త జీవితంలో అడుగుపెడతారని, పుట్టింటి ప్రేమను తెంచుకుని మెట్టినింటి బాధ్యతలు మోయడానికి రెడీ అవుతారు.కోటి ఆశలతో అడుగు ప్రారంభించాలకుంది.

కానీ, ఇంతలో ఆమె జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది.అనారోగ్యం రూపంలో ఆమె ఆశలు చిదిరిమేసింది.

Advertisement

కడుపు నొప్పిని తట్టుకోలేక తనువు చాలించుకుంది.పెళ్లై నెలరోజులు కాలేదు.

కాళ్లకు ఉన్న పారాణీ ఆరక ముందే నవ వధువు ఆత్మహత్య చేసుకున్నవిషాద ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.కర్నూల్ జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామానికి చెందిన ఎల్లప్ప కూతురు జయలక్ష్మిని కౌతాళం మండలం మల్లనహట్టి గ్రామానికి చెందిన లక్ష్మన్నతో వివాహం జరిగింది.

వీరిద్దరికి పెళ్లి జరిగి నెల రోజులైంది.కొత్త జీవితంలో అడుగుపడ్డాయి.

కోటీ ఆశలతో అడుగులు వేద్దాం అనుకున్నారు.కానీ అన్ని తలకిందులయ్యాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

భరించలేని కడుపునొప్పి రావడంతో ఆత్మహత్యకు యత్నించింది జయలక్ష్మి.ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి జయలక్ష్మి విషం తాగింది.

Advertisement

కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్న తర్వాత అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న జయలక్ష్మిని చూసి కుటుంబసభ్యులు స్థానిక ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.అప్పటికే జయలక్ష్మి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.

ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స పొందుతూ మరణించిందని డాక్టర్లు వెల్లడించారు.దీంతో ఇద్దరి కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.కేసు దర్యాప్తులో ఉంది.

తాజా వార్తలు