పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ”ప్రాజెక్ట్ కే” ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా నుండి అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.
అయినప్పటికీ ఈ సినిమా నుండి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.ఇంకా ఈ సినిమాలో కొత్త కొత్త యాక్టర్స్ భాగం చేస్తూనే ఉన్నాడు నాగ్ అశ్విన్.
ఇప్పటికే పలు క్రేజీ పోస్టర్స్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై హైప్ పెంచేయగా ఈ మధ్య వచ్చిన గాసిప్ తో మరింత హైప్ పెరిగింది.
ఈ సినిమాలో దీపికా పదుకొనే, బిగ్ బి వంటి స్టార్స్ భాగం అయిన విషయం విదితమే.వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్ర చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి ఈ వార్త నిజమే అని ఈ మధ్య క్లారిటీ రాగా ఇప్పుడు ఈయన షూట్ లో కూడా జాయిన్ అయినట్టు క్లారిటీ తెలుస్తుంది.
తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసేందుకు కమల్ హాసన్ సెట్స్ లో అడుగు పెట్టారని ఈయనపై నాలుగు వారాల పాటు షూటింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.మరి ఈ రూమర్స్ తో ప్రాజెక్ట్ కే సినిమా మరోసారి వార్తల్లో నిలువగా ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఇంట్రెస్ట్ పెడుతున్నారు.ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండగా. అశ్వనీదత్ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.