కల్వకుంట్ల కుటుంబం కలలు కంటోంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

 Kalvakuntla's Family Is Dreaming.. Union Minister Kishan Reddy's Key Comments-TeluguStop.com

కల్వకుంట్ల కుటుంబం కలలు కంటోందన్నారు.కేసీఆర్ ప్రధానమంత్రి అయినట్లు, కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినట్లు ఊహాల్లో విహరిస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ దేని కోసం పార్టీ పెడుతున్నారో ఆ పార్టీ నేతలకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ను దేశంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.

ఈ క్రమంలో తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న కిషన్ రెడ్డి.ఆ తర్వాత జాతీయ రాజకీయాల గురించి ఆలోచించండి అని సూచించారు.

వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు బీజేపీని ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు.కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు కలలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు కన్పిస్తున్నాయని చెప్పారు.

ఎంఐఎంను బలోపేతం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube