ఆ ఉద్యమం వల్ల మంచి, చెడ్డ తెలిసి ప్రవర్తిస్తున్నారంటున్న స్టార్ హీరోయిన్...

బాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్, స్టార్ హీరో అజయ్ దేవగన్ జంట ఒకటి.

వీరిద్దరి మధ్య ఉండే అర్థం చేసుకునే గుణం, అన్యోన్యత కారణంగా ఇప్పటికీ బాలీవుడ్ లోని కొత్త జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

అయితే పెళ్లయినప్పటి నుంచి కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉంటున్నటువంటి కాజోల్ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తన అభిమానులకి అందుబాటులో ఉంటుంది.అయితే ఒకప్పుడు బాలీవుడ్లో మీటూ ఉద్యమం ఎంత దుమారం రేపిందో పెద్దగా చెప్పనవసరం లేదు.

పలువురు నటీనటులు తమపై జరిగినటువంటి లైంగిక వేధింపులను బయట పెడతామంటూ చేసిన వ్యాఖ్యలకు మొత్తం బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.అయితే తాజాగా ఈ మీటూ ఉద్యమం అంశంపై నటి కాజోల్ స్పందించింది.

ఇందులో భాగంగా గత కొద్దికాలంగా మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు మార్పులను గమనించానని చెబుతోంది ఈ అమ్మడు.ఇందులో ముఖ్యంగా సినీ పరిశ్రమలో పని చేసినటువంటి ఆర్టిస్టులు కాని, లేదా టెక్నీషియన్లు కానీ వేరే ఇతర సిబ్బంది ఎవరైనా సరే ఆడవాళ్ళతో గౌరవ మర్యాదలతో మాట్లాడుతున్నారని ఆ విషయం తనకు బాగా నచ్చిందని అన్నారు.

Advertisement

ఇలాంటి గౌరవమైన పరిణామాలు మరియు మహిళలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం హర్షించదగ్గ  విషయమని అన్నారు.అంతేకాక గౌరవ మర్యాదలు అనేది ఆడ మగల మధ్య ఇచ్చి పుచ్చుకుంటే మంచి సన్నిహిత్యం స్నేహబంధం ఏర్పడుతుందని అన్నారు.ఇటీవల కాలంలో కాజోల్ భర్త అజయ్ దేవగన్ తో కలిసి తానాజీ అనే చిత్రంలో నటించింది.

ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.ప్రస్తుతం త్రిభంగ అనే చిత్రంలో నటిస్తోంది.

 .

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు