ఘాజీ దర్శకుడుకి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ మరల లాక్ డౌన్ తర్వాత రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.

విజయదశమి సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ సినిమా చేయబోతున్నాడు.

ఇక ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేసుకొని ఎన్టీఆర్ కోసం మాటల మాంత్రికుడు ఎదురుచూస్తున్నాడు.అతను ఎప్పుడు ఒకే అంటే అప్పుడు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోతుంది.

ఈ సినిమా త్రివిక్రమ్ వెర్షన్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఉండబోతుంది.దీంతో పాటు ఇప్పుడు తారక్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అనే టాక్ నడుస్తుంది.

Advertisement

ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అనే మాట కూడా వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒకే చెప్పాడని తెలుస్తుంది.

ఫిక్షన్ ఎలిమెంట్స్ తో రియలిస్టిక్ స్టొరీతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు అని తెలుస్తుంది.ఈ సినిమాని కూడా పాన్ ఇండియా మూవీగానే ఆవిష్కరించబోతున్నారని టాక్.

ఇప్పటికే దర్శకుడు ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒకే చేయించుకున్నాడని, అయితే డేట్స్ బట్టి ఎప్పుడు సినిమాని సెట్స్ పైకి ఎప్పుడు తీసుకెళ్ళేది ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించబోతుందని తెలుస్తుంది.

అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు