తేజ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి మూవీ చిత్రం.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ కావడంతో పాటు దర్శకుడు తేజకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
అలాగే ఆ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా పరికాహ్యం అయిన ఆర్పీ పట్నాయక్ కి, కెమెరామెన్ బి గోపాల్ రెడ్డి కి కూడా మంచి గుర్తింపు వచ్చింది.కొంత కాలం పాటు టాలీవుడ్ లో వీళ్ళ హవా కొనసాగింది.
అయితే ఏవో కారణాల వలన ఆర్పీ పట్నాయక్ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలు చేయడం ఆపేశారు.అప్పుడప్పుడు దర్శకుడుగా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు.
అయితే 21 ఏళ్ల తర్వాత మరల ఆ చిత్రానికి సీక్వెల్ ని దర్శకుడు తేజ ప్రకటించాడు.అలాగే అప్పుడు చేసిన టీమ్ మొత్తం మళ్ళీ ఈ సీక్వెల్ కి వర్క్ చేయబోతున్నారని ప్రకటించడంతో ఒక్కసారిగా మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది.
అయితే హడావిడిగా ఎనౌన్స్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కాని తరువాత ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.అందరూ కొత్తవాళ్లతో సినిమా ఉంటుందని చెప్పారు.అయితే కరోనా టైంలో ఆడిషన్ చేయడం కొద్దిగా కష్టంతో కూడుకున్న పని అని ఆ ప్రాజెక్ట్ ని దర్శకుడు తేజ కాస్తా హోల్డ్ లో పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.అయితే సినిమాలో హీరోయిన్ ని మాత్రం ఖాయం చేసినట్లు సమాచారం.తేజ చిత్రం1.1 తో ఎన్టీఆర్ భావమరిది నితిన్ చంద్రని హీరోగా పరిచయం చేయబోతున్నారని టాక్.నితిన్ చంద్ర ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తమ్ముడు అనే విషయం అందరికి తెలిసిందే.చాలాకాలంగా ఈ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో తేజ తన చిత్రం 1.1 కోసం అతనిని హీరోగా ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.