అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.సజ్జల దిన్నె భూ వ్యవహారంపై కలెక్టర్ ను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు.
ఈ క్రమంలో కొందరు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కాజేస్తున్నారు జేసీ ఆగ్రహాం వ్యక్తం చేశారు.భూవివాదంపై అధికారులు సరిగా స్పందించలేదని ఆరోపించారు.
అనంతరం పేపర్లను కలెక్టర్ నాగలక్ష్మీ ఎదుట టేబుల్ పై విసిరేసిన ఆయన.సజ్జల దిన్నె వ్యవహారంపై వాగ్వివాదానికి దిగారు.అడ్డుకోబోయిన కార్యాలయ సిబ్బందిని తోసివేశారు.కలెక్టర్ స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.