తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఈడీ విచారణకు హాజరైయ్యారు.జేసీ ట్రావెల్స్ కేసులో భాగంగా వాహనాల కొనుగోళ్ల వ్యవహారంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు.
దీనిలో భాగంగా ఆయన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ ను తీసుకొని ఈడీ కార్యాలయానికి వచ్చారు.జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేట్ మెంట్స్ ను ఈడీ రికార్డ్ చేస్తున్నారు.
అదేవిధంగా పలు కీలక అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.మొదటి రోజు దాదాపు తొమ్మిది గంటల పాటు జేసీని విచారించారు.
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే అభియోగాలు ఆయనపై ఉన్న సంగతి తెలిసిందే.