తరుణ్ విషయంలో నాదే తప్పు.. చిరంజీవికి ఇంపార్టెన్స్ ఇచ్చా.. దర్శకుని కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన జయంత్ సి పరాన్జీ ( Jayanth C.Paranjee ) ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రమణ గోగులకు బీజీఎం గురించి ఎక్కువగా అవగాహన లేదని అయితే ఆయన మంచి ట్యూన్స్ ఇవ్వడంతో మరొకరికి బీజీఎం విషయంలో ఛాన్స్ ఇచ్చానని ఆయన తెలిపారు.కథ సిద్ధమైన తర్వాతే ఈశ్వర్ లో ప్రభాస్ ను హీరోగా ఫిక్స్ చేశామని జయంత్ సి పరాన్జీ అన్నారు.

 Jayanth C Parnjee  Comments Goes Viral In Social Media Details Here ,  Jayanth C-TeluguStop.com

కొత్త హీరో కోసం ఈశ్వర్ కథ సిద్ధమైందని ఆయన తెలిపారు.నేను తక్కువగానే రీమేక్ సినిమాలు చేశానని జయంత్ సి పరాన్జీ అన్నారు.

మొహమాటానికి, ఆబ్లిగేషన్ కు యస్ అని చెప్పకూడదని ఆయన తెలిపారు.అయితే అల్లరి పిడుగు సినిమా తర్వాత నేను మారలేదని జయంత్ అన్నారు.

ఫెయిల్యూర్స్ నుంచి నేను నేర్చుకోలేదని ఆయన తెలిపారు.గడిచిన 16 ఏళ్లలో 3 సినిమాలు మాత్రమే చేశానని జయంత్ కామెంట్లు చేశారు.

దేనిని నమ్మితే దానిపై స్ట్రాంగ్ గా ఉండాలని జయంత్ చెప్పుకొచ్చారు. నా ఫస్ట్ సినిమా ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు.సినిమా హిట్టైతే నేనే కారణమని చాలామంది చెబుతారని సినిమా ఫ్లాపైతే నా మాట వినలేదని అంటారని జయంత్ అన్నారు.తరుణ్ సినిమా( Tarun ) విషయంలో నాదే తప్పు అని ఆయన కామెంట్లు చేశారు.

ఒకవైపు తరుణ్ సినిమా, మరోవైపు చిరంజీవి సినిమా చేయడంతో చిరంజీవి ( Chiranjeevi )మూవీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చానని ఆయన తెలిపారు.

చిరంజీవి సినిమాపై దృష్టి పెట్టిన స్థాయిలో తరుణ్ సఖియా నాతోరా( Sakhiya ) మూవీపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని జయంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒక సినిమాను పూర్తి చేసిన తర్వాత మరో సినిమా చేసి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు.జయంత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube