ఏపీ వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తారని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ అన్నారు.అక్టోబర్ 5 నుంచి ఈ యాత్రలు ప్రారంభిస్తారని తెలిపారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు.పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ కీలకమని వెల్లడించారు.
అదేవిధంగా ఐటీ వింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని సూచించారు.అనంతరం జనసేన నిర్వహించిన ఐటీ సమ్మిట్ లో ఆరు వందల మంది నిపుణులు పాల్గొన్నారని తెలిపారు.