ఎవడ్రా ఆపేది : టీడీపీ యాత్రలో జనసేన ! 

పొత్తుల చుట్టూనే ఏపీ రాజకీయం తిరుగుతోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని( YCP ) ఓడించేందుకు టిడిపి, జనసేన ,బిజెపిలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Janasena Flags Seen At Nara Lokesh Yuvagalam Padayatra Details, Tdp, Janasena, B-TeluguStop.com

ఇప్పటికే బీజేపీ జనసేన పొత్తు కొనసాగిస్తుండగా,  టిడిపి కూడా ఈ రెండు పార్టీలతో కలిసే సమయం వచ్చినట్టుగా కనిపిస్తోంది.ఎప్పటి నుంచో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రయత్నాలు చేస్తున్నా,  బిజెపి అగ్రనేతలు టిడిపిని దూరం పెడుతూనే వచ్చారు.

అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రత్యేకంగా చొరవ తీసుకుని బిజెపి నేతలను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు.దీనికి తగ్గట్లుగానే ఇటీవల కాలంలో బీజేపీ అగ్ర నేతల వైఖరి మారింది.

టిడిపి తో పొత్తు పెట్టుకునే ఆలోచనతోనే ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇక బిజెపి తమతో కలిసి వచ్చినా, రాకపోయినా , కచ్చితంగా టిడిపి తో పొత్తు పెట్టుకునే ముందుకు వెళ్తామనే విధంగా జనసేన వ్యవహరిస్తుంది.

దీనికి తగ్గట్లుగానే కొద్ది రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ బేటి అయ్యారు.ఈ సందర్భంగా పొత్తుల అంశంతో పాటు,  సీట్ల సర్దుబాటు వంటి విషయాలపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాకపోయినప్పటికీ,  క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన టిడిపి శ్రేణులు పొత్తు ఖాయమైనట్లుగానే భావిస్తున్నాయి.

Telugu Ap Bjp, Ap, Chandrababu, Janasena, Janasenani, Kurnool, Lokesh, Pawan Kal

దీనికి తగ్గట్లుగానే లోకేష్ ( Nara Lokesh ) నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్రలో జనసేన జెండాలు కనిపించడం,  జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేయడం సంచలనంగా మారాయి.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరుగుతున్న లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాలు కనిపించాయి.  పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు యువ గళం పాదయాత్రలో పాల్గొన్నారు.

దీంతో యువ గళం పాదయాత్రలో పాల్గొన్న టిడిపి శ్రేణులలోను ఉత్సాహం కనిపించింది.ఇక లోకేష్ యాత్ర ముగిసే వరకు జనసేన కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది.

Telugu Ap Bjp, Ap, Chandrababu, Janasena, Janasenani, Kurnool, Lokesh, Pawan Kal

ఇప్పటికే పొత్తుల విషయంలో జనసేన క్లారిటీ తెచ్చుకునేందుకు  చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు.దీనిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.ఇప్పుడు చంద్రబాబు పవన్ సమావేశం జరిగింది అని , భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు జరుగుతాయి అని,  విపక్షాల మధ్య ఓట్లు చేలకుందా జనసేన చూసుకుంటుందని నాదెండ్ల పేర్కొన్నారు.అధికారికంగా జనసేన, టిడిపిల పొత్తు ఖరారు కాకపోయినప్పటికీ , రెండు పార్టీల నాయకులతో పాటు, జనాల్లోనూ ఈ పొత్తుల పై క్లారిటీ వచ్చినట్లుగానే కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube