జగన్‌ తీసుకున్న మరో సంచలన నిర్ణయం

ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హాస్పిటల్స్‌ వరకే వర్తించేవి.

కాని ఇకపై హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో చికిత్స చేసుకున్న వారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తించేలా జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ఏపీలో వైధ్యం అందక చాలా మంది పేదవారు ఇబ్బంది పడుతున్నారు.పక్క రాష్ట్రాల్లో ఉన్న పెద్ద హాస్పిటల్స్‌కు వెళ్లి లక్షలు ఖర్చు చేస్తున్నారు.

అందుకే ప్రభుత్వం ఇకపై పక్క రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున్న వారికి కూడా డబ్బులు ఇస్తుందంటూ ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చింది.రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ప్రారంభం అయిన ఆరోగ్య శ్రీ పేదల పాలిట వరం అనుకోవచ్చు.

చిన్న జబ్బు పెద్ద జబ్బు ఏదైనా కూడా ఆరోగ్య శ్రీ ద్వారా చూపించుకోవచ్చు గతంతో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులతో ఆరోగ్య శ్రీ ప్రజలకు మరింత చేరువ అయ్యింది.పేద ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోవద్దంటూ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు.

Advertisement

వైకాపా నాయకులు ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తూ నియోజక వర్గాల్లో జగన్‌ చిత్ర పటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు.

తప్పుడు ప్రచారం చేస్తున్న నాగబాబుకు ఈసీ షాక్.. మెట్టుతో కొట్టినట్టు బుద్ధి చెప్పిందిగా!
Advertisement

తాజా వార్తలు