రోహిణిని పందికొక్కు అన్న జబర్దస్త్ కమెడియన్.. ఏమైందంటే..?

బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుని బుల్లితెర కామెడీ షోలలో లేడీ కమెడియన్ గా రోహిణి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

తాజాగా జులై 11వ తేదీన ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రోహిణి సందడి చేశారు.

జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న గెటప్ శ్రీను కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు.స్వయంకృషి, ప్రతిభతో గెటప్ శ్రీను క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.

ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ టీమ్ కు ఊహించని స్థాయిలో గుర్తింపు రావడానికి గెటప్ శ్రీను కూడా ఒక కారణమని చెప్పవచ్చు.విభిన్నమైన గెటప్స్ లో ఎంట్రీ ఇచ్చే గెటప్ శ్రీను తన పర్ఫామెన్స్ లో స్కిట్లు క్లిక్ అయ్యేలా చేశారు.అయితే ఈ కమెడియన్ వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రం గెటప్ శ్రీను రోహిణిని పందికొక్కుతో పోల్చడం గమనార్హం.తాజాగా ప్రసారమైన షోలో గెటప్ శ్రీను తన గెటప్ తోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

Advertisement

రోహిణి డల్ గా ఉండటంతో గెటప్ శ్రీను ఎందుకు డల్ గా ఉన్నావని అడగగా తన పండించిన పంటను పందికొక్కులు తిన్నాయని రోహిణి బాధ పడుతూ చెబుతుంది.రోహిణి అలా చెప్పడంతో గెటప్ శ్రీను నువ్వు పండించిన పంటను నువ్వే తిన్నావా.? అంటూ రోహిణి పరువు తీసేయడం గమనార్హం.

తాజాగా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా యూట్యూబ్ లో ఫుల్ ఎపిసోడ్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.అయితే లేడీ కమెడియన్ రోహిణిపై గెటప్ శ్రీను దారుణంగా ట్రోల్ చేయడం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గెటప్ శ్రీను అలా కామెంట్ చేసి ఉండకూడదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు