లాక్ డౌన్ ఎఫెక్ట్ : జబర్దస్త్ నుంచి ఆ యాంకర్ ఔట్....

తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ ఐనటువంటి ఈటీవీ లో ప్రతి గురు,శుక్ర వారాల్లో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే టువంటి జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలు తెలుగు బుల్లితెర  ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి.

అయితే ఒక పక్క కమెడియన్లు తమ కామెడీతో అదరహో అనిపిస్తుంటే, మరోపక్క  టాలీవుడ్ అందమైన యాంకర్లు రష్మి గౌతమ్ మరియు అనసూయ భరద్వాజ్ లు తమ వన్నె తరగని అందంతో మరింత వన్నె తెస్తున్నారు.

కాగా తాజాగా జబర్దస్త్ కామెడీ షో యాంకర్ల  విషయమై ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి నటి మరియు యాంకర్ అనసూయ జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నట్లు పలు వార్తలు బలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

అయితే అందుకు గల కారణాలు లేకపోలేదు.ఇటీవలే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించడంతో అనసూయ నటిస్తున్న చిత్రాల షూటింగులు ఆగిపోయాయి.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇటీవలే పలు చిత్రాల షూటింగుల నిర్వహణకు చిత్ర నిర్మాణ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో ఈ అమ్మడు నటిస్తున్నటువంటి చిత్రాలు అన్ని ఒకేసారి షూటింగ్ ప్రారంభం కానున్నాయి.

Advertisement

అందువల్ల అనసూయ డేట్ల విషయమై కొంతమేర క్లాష్ రావడంతో ఈ అమ్మడు జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.అయితే జబర్దస్త్ షో నుంచి యాంకర్ అనసూయ తప్పుకుంటే ఆమె స్థానంలో షో నిర్వాహకులు ఎవరిని తీసుకుంటారా.? అనే చర్చ సోషల్ మీడియాలో బలంగా సాగుతోంది.అయితే ఈ క్రమంలో ఎక్కువగా తెలుగు యాంకర్ మంజూష పేరు వినిపిస్తోంది.

 అయితే ఈ అమ్మడు కూడా ఒకప్పుడు పలు షోలు ఈవెంట్లలో తన గల గల మాటలతో బాగానే అదరగొట్టింది.అందువల్లనే జబర్దస్త్ షో నిర్వాహకులు అనసూయ స్థానంలో మంజూషని తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు