సెలబ్రేషన్ టైమ్.. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మంచు లక్ష్మి ట్వీట్?

కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి .

అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమై ఉత్తమ విలన్ గా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

ఆ తర్వాత దొంగాట సినిమాలో ఏందిరో అనే పాటకు గాను గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డుని అందుకున్నారు.అంతేకాకుండా తెలుగు ఫిలింఫేర్, స్పెషల్ జూరి అవార్డ్ ను కూడా దక్కించుకొని టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానాన్ని పొందారు.

ఇదిలా ఉండగా సోషల్ నెట్వర్కింగ్ లో నిత్యం యాక్టివ్ గా ఉంటే మంచు లక్ష్మీ.తాజాగా ఒక ట్వీట్ చేసి అందరికీ ఓ ముఖ్యమైన వార్తను పంచుకున్నారు.

తేజ్ సేఫ్’ అంటూ తాను చేసిన పోస్ట్ తో తెలుగు అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.ఇక వివరాల్లోకి వెళితే మెగా ఫ్యామిలీలో ఒక హీరో అయిన సాయి ధరమ్ తేజ్ బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికి తెలిసిందే.

Advertisement

కాగా వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తరలించి అనంతరం అపోలోకి మార్చారు.దీంతో గాయాల పాలైన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అందరికీ ఉత్కంఠ నెలకొంది.

విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, చిరంజీవిలు వచ్చి సాయి తేజ్ ని పరామర్శించారు.

ఈ సమయంలోనే మంచు లక్ష్మీ ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు కొంచెం రిలీఫ్ అయ్యారు. కాకపోతే, అదే ట్వీట్‌లో తనదైన శైలిలో ‘పండగ చేసుకుందాం’ అని కూడా అనటం విశేషం.ఏ మాత్రం తేడా వచ్చినా ఆ యాక్సిడెంట్ ప్రాణాంతకం అయ్యేదని చెప్పిన ఆమె.ప్రస్తుతం తేజు ట్రీట్మెంట్‌కి బాగానే రెస్పాండ్ అవుతున్నాడని తెలిపారు.అందుకే, మనం ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ వివరణ ఇచ్చారు మంచు లక్ష్మి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు