కరోనా తీవ్రంగా వ్యాపిస్తూ ఊహించని రీతిలో మరణాలను నమోదు చేస్తున్న సమయంలో ఈ మహమ్మారిని తరిమేయడానికి ఏదైనా మందు ఉంటే బాగుండు అని యావత్ ప్రపంచం ఆశించింది.
ఆ తర్వాత కొన్ని సంస్దలు వ్యాక్సిన్ తయారు చేయగా వాటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని జనం గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే.
కాగా తాజాగా అమెరికాకు చెందిన ఔషధ సంస్థ ఫైజర్ వ్యాక్సిన్ పై ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసింది.ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో గుండెలో మంటగా అనిపిస్తోందని పేర్కొంది.
కాగా ఈ ఫిర్యాదు పై స్పందించిన ఫైజర్ సంస్ద ప్రతినిధులు టీకా తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ లక్షణాలు కనిపించినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ అంశం పై పూర్తిగా సమీక్ష జరుపుతామని తెలిపింది.ఇందులో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్ సేఫ్టీ విభాగంతో చర్చలు జరుపుతున్నట్లుగా వివరించింది.