హైదరాబాద్ ను యూటీ చేస్తుందన్న అసదుద్దీన్ మాటల వెనక అసలైన వ్యూహం ఇదే?

సాధారణంగా బీజేపీ, ఎంఐఎం పార్టీ ఉప్పునిప్పులా ఉంటాయి.అనుక్షణం విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలను ఇరు పార్టీలు హీటెక్కిస్తుంటాయి.

 Is This The Real Strategy Behind Asaduddin's Statement That Hyderabad Will Be Ut-TeluguStop.com

అయితే ప్రతి సారి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేయడం జరిగింది.అయితే అకస్మాత్తుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటని ఒకసారి గమనిస్తే బీజేపీ ఇప్పుడు జాతీయ స్థాయిలో పలు వివాస్పద విషయాలను వెలికి తీస్తూ చట్టాలుగా మారుస్తూ ప్రజాగ్రహానికి గురవుతున్న విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా త్వరలో హైదరాబాద్ ను బీజేపీ ప్రభుత్వం యూటీ చేయబోతున్నదని సంచలన ఆరోపణలు చేశారు.ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.

అయితే అసదుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

ప్రజలను గందరగోళం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, హైదరాబాద్ ను యూటీ చేసే ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వానికి లేదని కిషన్ రెడ్డి అన్నారు.

అయితే అసదుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన వ్యూహం ఏంటని మనం గమనిస్తే బీజేపీ రోజురోజుకు బలపడుతున్న పరిస్థితులలో హైదరాబాద్ ను యూటీ చేసి ఆదాయాన్ని కేంద్రప్రభుత్వం లాక్కొని పోతుందనే ప్రచారాన్ని బలంగా చేస్తే బీజేపీ ఊపును నిరోధించవచ్చనేది ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది.చూద్దాం ఇటువంటి వ్యూహాల్ని బలంగా ప్రయోగించి బీజేపీ దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube