తెలుగులో ప్రముఖ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించినటువంటి "సాహో" చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ కి హీరోయిన్ గా పరిచయమై ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ "శ్రద్ధా కపూర్" గురించి తెలుగు సినీ పరిశ్రమ తెలియనివారుండరు.
అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ఫర్వాలేదనిపించినా పారితోషికం విషయంలో కొంతమేర బెట్టు చేయడంతో కొత్త టాలీవుడ్ సినీ అవకాశాలను దక్కించుకోలేకపోయింది.
అయితే తాజాగా ఈ అమ్మడు కి సంబంధించిన వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే తమిళంలో ప్రముఖ దర్శకుడు రతన్ కుమార్ దర్శకత్వం వహించిన "ఆమె" చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ మధ్య కాలంలో శ్రద్ధా కపూర్ నటించినటువంటి స్ట్రీట్ డాన్సర్ త్రీడీ, భాగీ 3 చిత్రాలు అనుకున్నంత స్థాయిలో విజయాన్ని నమోదు చేయలేక పోయాయి. దీంతో తన తదుపరి చిత్రాల కథల విషయంలో ఈ అమ్మడు కొంత మేర ఆచితూచి అడుగులు వేస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy