భారత్ వేదికగా పురుషుల హాకీ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే.మొదటి మ్యాచ్ స్పెయిన్ తో భారత్ గెలవగా.
రెండో మ్యాచ్ ఇంగ్లాండ్ తో “డ్రా” చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో భారత జైత్రయాత్ర కొనసాగిస్తూ మూడవ మ్యాచ్ వేల్స్ తో 4-2 తేడాతో గురువారం ఘన విజయం సాధించింది.
మ్యాచ్ 21వ నిమిషములో భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్, 32వ నిమిషంలో ఆకాష్ దీప్.రెండో గోల్ వేసి అదిక్యంలో నిలపడం జరిగింది.
ఆ తర్వాత 42, 44వ నిమిషంలో వేల్స్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు గోల్స్ వేయడం జరిగింది.
అనంతరం ఆకాష్ దిప్, హర్మాన్ ప్రీత్ పెనాల్టీ గోల్ కొట్టి భారత్ కు 4-2 తేడాతో విజయం అందించడం జరిగింది. మ్యాచ్ ప్రారంభం నుండి భారత్ ప్లేయర్స్ దూకుడుగా ఆడిన గాని చివరిలో.వేల్స్ టీం వరుసగా రెండు గోల్స్ వేయడం జరిగింది.
ఆ తర్వాత పెనాల్టీలో భారత్ పుంజుకోవటంతో.విజయం వరించింది.
దీంతో “పూల్ డీ”లో ఇంగ్లాండ్ టీంతో పాటు భారత్ అత్యధిక స్థానాలతో టాప్ లో నిలిచింది.