వైసీపీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా తనకంటూ సపరేటు ముద్ర వేసుకొని ప్రత్యర్థులపై తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ ఉంటారు.
ఇక ఇదే సమయంలో ఏపీ క్రీడా మరియు పర్యాటక శాఖ మంత్రిగా చలామణి అవుతున్నారు.మంత్రి పదవి బాధ్యతలు చేపట్టాక రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో వివిధ ఆటల పోటీలు పెడుతూ… పిల్లలలో ఉత్సాహం కల్పిస్తున్నారు.
విద్యార్ధులలో దాగి ఉన్న కొత్త టాలెంట్ కూడా వెలికి తీస్తున్నారు.ఇదిలా ఉంటే మంత్రి రోజాకు.
జాతీయస్థాయిలో కీలక పోస్ట్ దక్కింది.
విషయంలోకి వెళ్తే కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా రోజాని నియమిస్తూ సెక్రటరీ జితిన్ నర్వల్ ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం ఐదు రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకు ఈ అవకాశం లభించింది.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంత్రి రోజాకు స్థానం కల్పిస్తూ లేఖ రాయడం జరిగింది.
కార్యవర్గంలో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖల మంత్రులకు కేంద్రం ఈ అవకాశం కల్పించడం జరిగింది.కాగా దక్షిణ భారతదేశం నుంచి ఒక్క ఆర్కే రోజాకీ ఈ పదవి వరించడం విశేషం.