ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ ను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆస్పత్రులను సందర్శించాలని తెలిపారు.అదేవిధంగా పాత ఆస్పత్రులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాస్పత్రులలో క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలతో పాటు కాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
మరోవైపు గోరుముద్దలో భాగంగా వారానికి మూడు సార్లు చిన్నారులకు రాగిమాల్ట్ పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.