హీరోయిన్ల మాదిరి ఎలాంటి మొటిమ, మచ్చ లేకుండా అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలనే కోరిక చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది.అందుకే చర్మం కోసం ఎంతో ఖరీదైన క్రీమ్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ ను కొనుగోలు చేసి యూస్ చేస్తుంటారు.
అలాగే మార్కెట్ లో లభ్యమయ్యే ఫేస్ మాస్క్లను వాడుతుంటారు.తరచూ బ్యూటీపార్లర్స్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని ట్రై చేస్తే.ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.
మీ ముఖం సహజంగానే అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక చిన్న బొప్పాయి పండును తీసుకొని పై తొక్క, లోపల ఉండే గింజలను తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక టమాటోను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేయాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పండు ముక్కలు, టమాటో ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్ లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకోవాలి.పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకుని.
అప్పుడు వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ అండ్ న్యాచురల్ రెమెడీని ట్రై చేస్తే గనుక.చర్మంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు ఉన్న తొలగిపోయి ముఖం తెల్లగా, మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది.హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం మీ సొంతం అవుతుంది.