బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.రెండు స్థానాల్లో పోటీ చేస్తానన్న ఈటల వ్యాఖ్యలకు స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎందుకు హుజూరాబాద్ లో కూడా పోటీ అన్న మంత్రి గంగుల ఈటల రాజేందర్ భయపడ్డారా అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఈటలకు దమ్ముంటే గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలని సవాల్ చేశారు.
అనంతరం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నవారికి ఓటు వేయొద్దని సూచించారు.కరీంనగర్ ఇంకా అభివృద్ది కావాలంటే బీఆర్ఎస్ ను మరోసారి గెలిపించాలని చెప్పారు.
తెలంగాణ యువత భవిష్యత్ ను కేసీఆర్ కాపాడుతారని పేర్కొన్నారు.అదేవిధంగా ఈనెల 18న మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి గంగుల వెల్లడించారు.