తోట త్రిమూర్తులు, MLC రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై జరుగుతున్న ప్రచారం లో భాగంగా నా వంతుగా స్పందిస్తున్నా రాజకీయంగా లబ్ది పొందడానికి కాపు ఉద్యమాని ఉపయోగించుకొన్నారన్న పవన్( pawan ) వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.ముద్రగడ స్పూర్తితో మేము ఉద్యమాల్లో ముందుకు వెళ్ళాం.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి( Chandrasekhar Reddy ) ఉద్యమానికి సహకరించాడు అని ముద్రగడ లేఖలో రాయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానునేటి యువతకు 30సంవత్సరాల క్రితం చేసిన పోరాటం తెలీదు.ఇలా ట్రోల్ చేసి మనం రోడ్ మీద పడడం కరెక్ట్ కాదు.
ముద్రగడ, పవన్ ల మధ్య జరిగే వార్ కి ఈ రోజుతో ముగింపు పలకాలి.ఎవరినో అందలం ఎక్కిండానికి మనం కొట్టుకోవడం ఏంటి? నేను వ్యక్తిగత విషయాల జోలికి పోను.అమలాపురంలో పవన్ కల్యాణ్ నన్ను ఓడించచాలని చెప్పారు.చంద్రబాబు మోచేతి నీళ్లు తాగడం లేదు.పౌరుషం ఉన్న గోదావరి నీళ్లు తాగాను.నా మీద పవన్ కు ఎందుకు అంత కోపమో నాకు అర్థం కాలేదు.







