గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను చక్కగా అమలు చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు.ఇటీవల సుప్రీంకోర్టు వై క్యాటగిరి ఉన్న వ్యక్తులు తప్ప మరెవరు వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదు అని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇదే విషయం పట్ల హైదరాబాద్ పోలీసులు చిన్న సెలబ్రిటీ ల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి కారు లను ఆపి వారి కార్లకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించి అనంతరం వారికి జరిమానా విధిస్తారు.ఇటీవలే టాలీవుడ్ లోని పలువురు హీరోలకు పోలీసులు జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఆ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ ఇలా కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం లను తొలగించారు.
అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా చేరారు.
తాజాగా అక్కినేని నాగచైతన్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.నాగచైతన్య కారుని ఆపి అతని కారుకు ఉన్న బ్లాక్ ఫిలిం ను తొలగించి, అనంతరం నాగచైతన్యకు 700 రూపాయలు జరిమానా విధించారు.
ఆ సమయంలో నాగచైతన్య కార్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రకారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రతి ఒకరిని ఆపి ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ను తొలగించడమే కాకుండా అనంతరం వారికి జరిమానా కూడా విడిస్తున్నారు.నాగచైతన్య విషయానికి వస్తే.నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
విడాకుల తర్వాత నాగచైతన్య పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా విడాకుల ముందు సోషల్ మీడియాలో ఎప్పుడూ అంతగా యాక్టివ్ గా ఉండండి నాగచైతన్య ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా కనిపిస్తున్నాడు.