హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది.ఎవరూ ఊహించని పనిని ఓ కసాయి తండ్రి తన కన్న కొడుకు విషయంలో చేసిన ఘటన హైదరాబాద్ మహానగరంలో వెలుగులోకి వచ్చింది.
కలలో కూడా ఏ తండ్రి చేయని పనిని ఆ కసాయి తండ్రి చేశాడు.నెలలు నిండిన పసిగుడ్డును డబ్బుల కోసం అమ్మేశాడు.
పోషించుకునే స్థోమత లేకనో మరేతర కారణాలతోనో తప్పని పరిస్థితుల్లో పొత్తిళ్లలోని పిల్లలను అమ్ముకునే తల్లులను మనం చూశాం.కానీ ఇక్కడ కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కర్కోటకుడిగా మారాడు.
డబ్బుల కోసం నెల రోజుల శిశువునే బేరానికి పెట్టాడు.పెట్టడమే కాదు ఏకంగా బేరమాడి మరీ రూ.70వేలకు విక్రయించాడు.ఈ ఘటన సాక్షాత్తు హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని ఛాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి జరిగినట్లు తెలిసింది.గుర్తు తెలియని వ్యక్తులతో రూ.70వేలకు బేరం కుదుర్చుకున్న ఆ కసాయి తండ్రి కేవలం నెల రోజుల పసిగుడ్డును డబ్బుల కోసం విక్రయించాడు.అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న శిశువు తల్లీ పోలీసులను ఆశ్రయించి సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపడుతున్నారు.తన గుండెలపై, భుజాలపై ఎత్తుకుని ఆడించాల్సిన తండ్రే ఇలా కసాయిలా మారి తన చంటి బిడ్డను విక్రయించడం చాలా బాధాకరమని అంటున్నారు అంతా.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.