డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల‌పై స‌వాళ్ల‌తో వేడెక్కుతున్న హుజూరాబాద్ రాజ‌కీయం..

ఇప్పుడు హుజూరాబాద్‌లో ఇద్ద‌రి మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డుస్తోంది.అదేంటి పార్టీల మ‌ధ్య కాదా అనుకునేరు.

ఇక్క‌డ పార్టీల పేర్లు ప‌క్క‌కు పోయి హ‌రీశ్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్ మ‌ధ్య స‌వాళ్ల ప‌ర్వం న‌డుస్తోంది.ఇద్ద‌రిలో ఒకిరిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేసుకుంటూ రాజకీయాల‌ను వేడెక్కిస్తున్నారు.

ఇక టీఆర్ ఎస్ త‌ర‌ఫున అభ్యర్థి గెలుపును త‌న భుజాన వేసుకుని అంద‌రికంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతూ మంత్రి హరీష్ రావు బాగానే తిరుగుతున్నారు.ఇక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్ కూడా క్యాండిడేట్‌పై విమ‌ర్శ‌లు చేయ‌కుండా కేవ‌లం మంత్రి ప‌ద‌విలో ఉన్న హ‌రీశ్ లేదా కేసీఆర్ ల‌పైనే విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక హరీష్ రావు అయితే టీఆర్ఎస్ చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక్క‌డే ఈట‌ల రాజేంద‌ర్ కూడా త‌న హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గానికి చేసిన మంచి ప‌నులు, అభివృద్ధి గురించి వివ‌రిస్తూ ఓట్లు అడుగుతున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య ఓ విష‌యంలో మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో పేదల కోసం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదంటూ హ‌రీశ్ ఆరోపించారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు క‌ట్ట‌లేని వ్య‌క్తి ప్రతిపక్ష పార్టీలో గెలిస్తే ఇళ్లు నిర్మిస్తారా అంటూ కౌంట‌ర్ వేస్తున్నారు.

ఇక దీని జ‌వాబుగా ఈట‌ల రాజేంద‌ర్ మ‌రో స‌వాల్ విసురుతున్నారు.అస‌లు రాష్ట్రంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టిన‌ట్టు చెబుతున్న హ‌రీశ్‌రావు దానిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా అంటూ ప్రశ్నించారు.హుజూరాబాద్‌కు సాంక్ష‌న్ అయిన ఇండ్లు ఎన్ని క‌ట్టిన‌వి ఎన్ని అనే వాటిపై కూడా చ‌ర్చిద్దామ‌ని చ‌ర్చ‌కు సిద్ధమేనా అంటూ రాజ‌కీయాన్ని ఒక్క‌సారిగా వేడెక్కించారు.

ఏ మంత్రి కూడా వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇండ్లు క‌ట్ట‌లేద‌ని హ‌రీశ్ క‌ట్టుక‌థ‌లు చెప్తున్నారంటూ రాజకీయాల‌ను వేడెక్కిస్తున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు