విడాకులిస్తే రూ.20 లక్షలు ఇస్తానన్న భర్త !

సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి.భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

కానీ కొందరూ వ్యక్తులు పెళ్లిని నాటకంలా భావిస్తున్నారు.భార్యపై మోజు తీరిందని, అనుమానం, అక్రమ సంబంధాలు, ఎదురు మాట్లాడుతుందని, ఇలా గొడవలు పడుతూ.

విడిపోతున్నవారితో పాటు భర్త చేతిలో ప్రాణాలు కోల్పోతున్న మహిళలు సంఖ్య ఎక్కువగానే ఉంది.అయితే అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను వదిలించుకోవడానికి ఓ భర్త తన భార్యకు రూ.20 లక్షల ఆఫర్ చేశాడు.విడాకులు ఇమ్మని వేధింపులకు పాల్పడుతున్నాడు.

వివాహ బంధానికే వెల కట్టిన ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలో చోటు చేసుకుంది.మండలానికి చెందిన రోజాకు రవిశేఖర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.పెళ్లి సమయంలో రోజా తల్లిదండ్రులు కట్నంగా రూ.2 లక్షల నగదును, రూ.4 లక్షల బంగారాన్ని అందించారు.గతేడాది వరకు సంతోషంగా గడిపారు ఈ దంపతులు.

Advertisement

భార్య మీద మోజు తీరిందో ఏమో రవిశేఖర్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కొనసాగించాడు.దీంతో తన భార్య రోజాను విడిపించుకుని వేరే అమ్మాయితో కాపురం పెట్టాలని డిసైడ్ అయ్యాడు.

ఈ విషయం పెద్దల పంచాయతీ వరకు వెళ్లింది.గ్రామ పెద్ద సర్ది చెప్పినా పట్టించుకోలేదు.రూ.20 లక్షలు ఇస్తానని, విడాకులు కావాలని వేధిస్తున్నాడని భార్య రోజా ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు