దారుణం : గర్భిణీ భార్యను హత్య చేసిన భర్త.. ఆ తర్వాత..?

ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతుంది.కట్టుకున్న వాళ్లని కడతేర్చేందుకు కూడా వెనకాడటం లేదు.

ఇలాంటి ఘటనలు చాలానే తెరమీదకు వస్తున్నాయి.ఇలాంటి దారుణ ఘటన మరొకటి జరిగింది.

తన భార్య గర్భిణి అని కూడా చూడకుండా అనుమానంతో అతి దారుణంగా హత్య చేశాడు భర్త.అనంతరం మృతదేహాన్ని పొలంలో పాతి పెట్టేసాడు.

ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా హోలగుందా మండలం లో జరిగింది.మండలానికి చెందిన బసవరాజు వీణ లు 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.

Advertisement

ఇటీవలే భార్యపై అనుమానం పెంచుకున్నాడు బసవరాజు.తరచూ తన భార్యను వేధించేవాడు.

జూన్ 2వ తేదీ నుంచి వీణ కనిపించకుండా పోయింది.దీంతో సదరు యువతి తల్లిదండ్రులు బస్వరాజుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ.

వివిధ కారణాలు బుకాయించాడు.ఈ నేపథ్యంలో వీణా తండ్రి పోలీసులను ఆశ్రయించి అల్లుడిపై అనుమానం ఉంది అని ఫిర్యాదు చేశాడు.

ఇక రంగంలోకి దిగిన పోలీసులు బస్వరాజు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించారు.ఇక నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు రెవిన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

కాగా సదరు మహిళ ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు,.

Advertisement

తాజా వార్తలు