సంపద ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.కానీ అది ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు.
స్వార్థం కూడా అందరికీ ఉంటుంది.ఎవరినీ ఇబ్బంది పెట్టనంత వరకు స్వార్థం కూడా మంచిదే.
అయితే కట్టుకున్న భార్య మానాన్ని సైతం వదులుకునేంత స్వార్థం ఎప్పటికీ మంచిది కాదు.కానీ అదే జరిగింది మహారాష్ట్రలోని పుణె ప్రాంతంలో.
వ్యాపారంలో లాభాలు బాగా రావాలని, ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలని ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు.అఘోరీ పూజ చేస్తే అంతా అనుకున్నట్లే జరుగుతుందని ఎవరో చెప్పారు ఆ వ్యక్తికి.
అతడు చెప్పినట్లుగానే ఆ వ్యాపారి చేశాడు.అఘోరీ పూజ చేసి దాని తర్వాత తన నగ్నంగా స్నానం చేయాలని తన భార్యపై ఒత్తిడి తెచ్చాడు.
ఈ దారుణ చర్యకు అతని తల్లిదండ్రులు కూడా సహకరించడం గమనార్హం.భర్త, అత్తమామల ఒత్తిడి తీవ్రంగా ఉండటం.తాను నిస్సహాయురాలు కావడంతో తనకు వేరే దారి లేకపోయింది.అందరూ చూస్తుండగానే భర్త, అత్తమామలు చెప్పినట్లుగా నగ్నంగా స్నానం చేసింది.అక్కడ ఉన్న వారు ఆ భర్త, తల్లిదండ్రుల సహకారంతో చేసిన వికృత చేష్టలను చూస్తూ ఉండిపోయారు.అనంతరం ఆ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అందరి ముందు తన పరువు తీశారని ఫిర్యాదులో పేర్కొంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
దారుణంలో భాగస్వాములైన అతని తల్లిదండ్రులను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.