వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణంలో కొన్ని పనులను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రాజెక్టులోని తీగలేరు బ్రాంచ్ కెనాల్లో.60- సి కింద డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులను తొలగించింది.అదేవిధంగా తీగలేరు సప్లయ్ ఛానల్ కు సంబంధించి మిగతా రూ.84 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది.ఈ క్రమంలో పనులు చేపట్టేందుకు కొత్తగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.







