పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే అందరిలో ఒక ఉత్సాహం ఉంటుంది.మిర్చి సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ కు మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు.
ఇక బాహుబలి సిరీస్ తో ఈయన కీర్తి దేశం దాటిపోయింది.ఈ సినిమాతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
ఈయన క్రేజ్ పాన్ ఇండియా వ్యాప్తంగా ఉండడంతో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ నిరాశ పరచడంతో ఇప్పుడు రాబోయే నెక్స్ట్ సినిమాపై అందరి ద్రుష్టి పడింది.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా ఇటీవలే టీజర్ వచ్చింది.
ఈ టీజర్ తర్వాత ఈ సినిమా చాలానే ట్రోల్స్ వచ్చిన అభిమానించే ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో ఉన్నారు.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
ఇక ఆదిపురుష్ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే. సీతగా కృతి సనన్ నటిస్తుంది.
లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.
ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాకు సంబందించిన సాంగ్స్ విషయంలో కూడా చర్చించు కుంటున్నారు.మరి ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు.మొత్తం ఈ సినిమాలో మూడు పాటలు ఉంటాయట.
సినిమా టీజర్ లో ఇప్పటికే జై శ్రీరామ్ అనే పాట వచ్చింది.ఈ పాటనే సినిమా మొత్తం ట్రావెల్ అవుతుందట.
అలాగే మరొక పాట కూడా ఉంటుంది కానీ అది ప్రొమోషన్స్ కోసం మాత్రమే అని తెలుస్తుంది.ఇందులో ఒక అద్భుతంగా ఉంటుంది అని ఇది సీతారాముల కలయిక సమయంలో వస్తుంది అని అంటున్నారు.
చూడాలి మరి సాంగ్స్ తో మెస్మరైజ్ చేస్తారో లేదో.







