మద్యపానం పట్ల మనిషికి మక్కువ ఏర్పడటానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కోతులపై పరిశోధనలు చేశారు.కోతి తినే పండ్లలో దాదాపు 2 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు కనుగొన్నారు.
ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యింది.బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్త రాబర్ట్ డడ్లీ 25 సంవత్సరాలుగా మనిషి మద్యపానానికి ఎందుకు దాసుడవుతున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.2014లో అతను దానిపై ఒక పుస్తకాన్ని రాశారు (ది డ్రంకెన్ మంకీ: వై వి డ్రింక్ అండ్ అబ్యూజ్ ఆల్కహాల్).ఇందులో మద్యంపై మనుషులకు మక్కువ ఏర్పడటానికి గల కారణాలను విశ్లేషించారు.
తాజాగా చాలామందికి ఆల్కహాల్పై ఇష్టం ఏర్పడటానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కొత్త అధ్యయనం జరిగింది.ఇది ‘డ్రంకెన్ మంకీ’ పరికల్పనకు మద్దతు ఇస్తుంది.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జీవశాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు.ఇందుకోసం పనామాలో బ్లాక్ హ్యాండ్ స్పైడర్ కోతి తిన్న పండ్లు, మూత్రం నమూనాలను సేకరించారు.
కోతులు జాబోలోని కొన్ని కుళ్లిన పండ్లను తినడానికి ఇష్టపడతాయని ఈ అధ్యయనంలో తేలింది.ఇందులో ఆల్కహాల్ కంటెంట్ ఒకటి నుంచి 2 శాతం మధ్య ఉంటుంది.
ఇది సహజ కిణ్వ ప్రక్రియ నుండి మాత్రమే ఏర్పడింది.ఈ పరిమాణం తక్కువ ఆల్కహాల్ బీర్తో సమానంగా ఉంటుంది.
అంతే కాకుండా కోతుల మూత్రంలో మద్యం ఆనవాళ్లు కనిపించాయి.

ఈ పరిశోధనలో పాల్గొన్న క్రిస్టినా క్యాంప్బెల్ మాట్లాడుతూ మొదటిసారిగా మనిషిని పోలిన కోతులు ఆల్కహాలిక్ పండ్లను తింటాయని నిరూపించగలిగామన్నారు.ఇది మొదటి అధ్యయనం మాత్రమే.దీనిపై మరింత కృషి చేయాల్సి ఉంది.
అయితే ఈ అధ్యయనం తర్వాత ‘డ్రంకెన్ మంకీ’ పరికల్పనలో ఖచ్చితంగా కొంత నిజం ఉందని తెలుస్తోంది.ఈ అధ్యయనం ఉద్దేశ్యం ఏమిటంటే.
మానవులకు మద్యం తాగాలనే కోరిక ఎలా వచ్చిందో తెలుసుకోవడం.అది ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తించడం.
ఇందుకోసం శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు సాగిస్తున్నారు.







