వయసు పెరుగుతున్న కొద్ది ముఖంలో ఎన్నో మార్పులు సంత రించుకుంటాయి.ముఖ్యంగా ముడతలు, సన్నని చారలు, మచ్చలు వంటి సమస్యలు ఏర్పడి.
వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.దీంతో వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియక.
తీవ్ర ఒత్తిడి గురవుతుంటారు.ఫలితంగా, సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.
అలా కాకుండా కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే.సులభంగా వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టి ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించవచ్చు.
మరి ఆ చిట్కాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
తులసి.
వృద్ధాప్య ఛాయలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.కొన్ని తులసి ఆకులను తీసుకుని మొత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమానికి ముఖానికి, మెడకు అప్లై చేసి.అర గంట పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.
ముడతలు, మచ్చలు పోయి ముఖం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
అలాగే పసుపు కొమ్ములను దోరగా వేగించి వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఈ పసుపు పొడిలో చందనం పొడి, తేనె, రోజ్ వాటర్, కలబంద గుజ్జు కలిపి ముఖానికి ఫ్యాక్లా వేసుకోవాలి.బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేసినా వృద్ధాప్య ఛాయలు దూరం అయ్యి.ముఖం మృదువుగా మరియు యవ్వనంగా కనిపిస్తుంది.
ఇక ఈ చిట్కాలతో పాటు.రెగ్యులర్గా గ్రీన్ టీ తీసుకోవాలి.
ఆరెంజ్, కివీ పండు, దానిమ్మ, పుచ్చకాయ వంటి పండ్లను డైట్లో చర్చుకోవాలి.నీరు ఎక్కువగా తాగాలి.
ప్రతి రోజు తగినంత నిద్ర పోవాలి.అలాగే స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజ్ అప్లై చేసుకోవడంతో పాటు.
రాత్రి నిద్రించే ముందు వేసుకున్న మేకప్ను పూర్తిగా తొలిగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడంతో ద్వారా వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి.