కొందరు చేసే పనులు అత్యంత విచిత్రంగా అనిపిస్తాయి.వారికేమైనా పిచ్చి లేచిందా అనిపిస్తుంది.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఇండియన్ కూడా జాతిపిత మహాత్మాగాంధీని అభిమానిస్తారు, అభిమానించాలి.కాని కొందరు మాత్రం మహాత్మాగాంధీని విమర్శించడం ఫ్యాషన్ అనుకుంటారు.
గాంధీజీపై కొందరు అసత్య వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేస్తూ ఉంటారు.ప్రతి సారి హిందూ మహాసభల్లో గాంధీజీని అవమానించడం, ఆయనపై విమర్శలు చేయడం చేస్తూ ఉంటారు.
తాజాగా మరోసారి హిందూ మహాసభల ప్రతినిధులు మరో అడుగు ముందుకు వేసి గాంధీజీని మరీ దారుణంగా చంపినట్లుగా చిత్రీకరించారు.
గాంధీజీ చిత్ర పటంను పెట్టుకుని ఏకంగా గన్తో పేల్చినట్లుగా ఫొటోలకు ఫోజ్లు ఇచ్చారు.ఆ ఫోజ్లు మాత్రమే కాకుండా గాంధీజీని కాల్చితే ఆయనకు రక్తం వచ్చినట్లుగా కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు.మరీ ఇంత పైసాచిక ఆనందం ఏంటో.
గాడ్సే ఈజ్ గ్రేట్ అంటూ వీరు నినాధాలు చేస్తూ వస్తున్నారు.ప్రతి హిందూ మహాసభల సమయంలో ఇలాంటి సంఘటనలు కామన్ కాని, ఈసారి సీన్ మరింత సీన్ చేశారు.
దేశ వ్యాప్తంగా వీరపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి.
ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధిస్తేనే మరొకరు ఇలా ప్రవర్తించరు అంటూ జనాలు కోరుకుంటున్నారు.