కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల టెండర్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియ కొనసాగించుకోవచ్చని ధర్మాసనం తెలిపింది.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు టెండర్లపై తుది నిర్ణయం తీసుకోవద్దని తెలిపింది.అదేవిధంగా ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వంతో పాటు టీఎస్ఎమ్ఐడీసీకి నోటీసులు జారీ చేసింది.