కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం,కొన్ని అనారోగ్య సమస్యలు కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.శరీరంలో నీటి శాతం తగ్గి కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ వంటి రసాయనాలు పేరుకొని పోయి కిడ్నీలో రాళ్ళగా మారతాయి.

 Remedies For Kidney Stones In Telugu-TeluguStop.com

కిడ్నీలో రాళ్లు ఉన్నాయంటే విపరీతమైన నొప్పి కలుగుతుంది.ఆ బాధను అసలు తట్టుకోవటం చాలా కష్టం.

కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు డాక్టర్ కి చూపించుకోవాలి.డాక్టర ఇచ్చిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను పాటిస్తే ఉపశమనం తొందరగా కలుగుతుంది.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ తులసి రసంలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగాలి.ఇలా క్రమం తప్పకుండ మూడు నెలల పాటు చేయాలి.

ఉలవల్లో ముల్లంగి ఆకులను వేసి బాగా మరిగించాలి.ఈ నీటిని వడకట్టి చారుగా తయారుచేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి.

తాజా మామిడి ఆకులను నీడలో ఆరబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి.ఈ పొడిలో నీటిని కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది.

తరచుగా ఆపిల్ జ్యుస్ త్రాగుతూ ఉంటే నిదానంగా చిన్న చిన్న రాళ్లు కరిగిపోతాయి.ఆపిల్ లో ఉండే లక్షణాలు రాళ్లను కరిగిస్తాయి.

అయితే పెద్ద రాళ్లు అయితే కాస్త సమయం పడుతుంది.

రెండు కప్పుల నీటిలో కొత్తిమిర వేసి ఒక కప్పు నీరు అయ్యేవరకు మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు త్రాగాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే కిడ్నీలో రాళ్లు క్రమంగా తగ్గిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube